E-Paper
Advertisement

పశ్చిమాన భూప్రకంపనలు.. నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో బెంబేలెత్తిన ప్రజలు, రోడ్లపైకి పరుగులు

పశ్చిమాన భూప్రకంపనలు.. నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో బెంబేలెత్తిన ప్రజలు, రోడ్లపైకి పరుగులు
Advertisement

Earthquake: భూప్రకంపనలు సెగ ఇండియాను తాకుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి మహారాష్ట్ర-గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు అయ్యింది. ముఖ్యంగా నాసిక్-సూరత్- వాపిలలో భూమి కంపించినట్లు నివేదికలు వస్తున్నాయి.

 

దేశంలోని పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు

Advertisement

 

దేశంలోని గడిచిన కొన్నాళ్లుగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నలుదిక్కులా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ప్రకంపనలు వస్తున్నాయి. తాజాగా శనివారం రాత్రి మహరాష్ట్ర, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు అయ్యింది.

Advertisement

 

రాత్రి నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో కంపించిన భూమి

 

సూరత్ నుంచి నాసిక్ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్లు భూమి ఒక్కసారిగా వణకడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పారిపోయారు. నాసిక్‌తోపాటు సూరత్, వాపిల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జూలై వ్యాప్తంగా పశ్చిమ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల తర్వాత భూగర్భంలో పెరిగిన ఒత్తిడి వల్ల ఇలా జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.

 

రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదు.. రోడ్లపైకి ప్రజలు పరుగులు

 

నాసిక్‌కు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాన్వాడ్ గ్రామంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. నాసిక్ సిటీతోపాటు ఆ జిల్లాలోని దిండోరి, నిఫాడ్, పేఠ్, సుర్గానా, ఇగత్‌పురి భూమి కంపించింది. అంతకుముందు పేఠ్, సుర్గానా తాలూకాలలో మూడు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. వాటికంటే ఈసారి ప్రకంపన తీవ్రంగా ఎక్కువగా ఉందని అంటున్నారు.

ALSO READ: ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్.. రూ.80,000 జీతం.. ట్రాయ్ విభాగంలో జాబ్స్

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ-NCSకి చెందిన ఓ అధికారి ఈ విధంగా చెప్పుకొచ్చారు. జూలైలో ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా భూమి కింద ఉన్న శిలల పగుళ్లలోకి నీరు చేరిందని, దాని కారణంగా ఒత్తిడి పెరిగి దక్కన్ పీఠభూమిలో భూమి కదలడానికి కారణమైందని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో తక్కువ తీవ్రత గల భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని సూరత్, డాంగ్ జిల్లాలో రాత్రి 10 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అహ్వా, సక్రపతాల్, గల్కుండ్‌, సపుతారా ప్రాంతాల్లో భూమి కంపించింది. సపుతారాలోని పర్యాటకులు బస చేసే హోటళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

Related News

ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్.. రూ.80,000 జీతం.. ట్రాయ్ విభాగంలో జాబ్స్

కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!

ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలు ఇవే!

డీ లిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి అకాలీదళ్ పార్టీ బిగ్ షాక్..!

ఈ గణాంకాల మాటేంటి? ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సవాల్!

విదేశాల్లో ఉద్యోగమని.. బీర్ షాపు ఓనర్‌కు అమ్మేశారు.. బాధితురాలు చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు!

Big Stories

Advertisement
×