BigTV English
Advertisement

Delhi Election Schedule: మోగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా.. ఎన్నికలు, ఫలితాలు ఎప్పుడంటే.

Delhi Election Schedule: మోగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా.. ఎన్నికలు, ఫలితాలు ఎప్పుడంటే.

Delhi Elections : రాజధాని ప్రాంతమైన దిల్లీ అసెంబ్లీకి 2025 ఎలక్షన్ల షెడ్యూళ్ ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది.  కేజ్రివాల్ నేతృత్వంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని అధికార భాజపా మధ్య కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో దిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీల ప్రకటనతో అన్ని పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది.


ఎన్నికల సంఘం విడుదల చేసిన తేదీలు..

దిల్లీ అసెంబ్లీకి ఈనెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. పూర్తి వివరాలు అప్పుడు విడుదల చేయనున్నారు. కాగా.. ఫిబ్రవరి 5 న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒకే విడుదలతో 70 స్థానాల దిల్లీ అసెంబ్లీకి ఒకేవిడుదలతో ఎన్నికల్ని ముగించనుంది. మూడురోజుల వ్యవధిలో ఫిబ్రవరిలో 8న కౌటింగ్ నిర్వహించి.. సాయంత్రం లోగా ఎన్నికల ఫలితాల్ని వెలువరించనున్నరు.


కాగా.. ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయింది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. పోరుకు సిద్ధం కాగా, ప్రధాని మోదీ సైతం వరుస ఎన్నికల సభలతో హడావిడిగా ఉన్నారు. పైగా.. ఆ పార్టీ యంత్రాంగం మొత్తం ఎలాగైనా దిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ రెండు పక్షాల మధ్య… కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. స్థానికంగా బలమైన పార్టీ నిర్మాణం ఉన్న కాంగ్రెస్.. గతంలో వరుసగా మూడుసార్లు దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మళ్లీ అలాంటి చరిత్రను సృష్టించేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×