E-Paper
Advertisement

25 crores seized: నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?

25 crores seized: నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?
Advertisement

ED raid news today(Today latest news telugu): లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయలు, బంగారం పట్టుబడుతోంది. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో 25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంత డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే…

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఉదయం అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 25 కోట్ల రూపాయలను బయటపడడంతో అధికారులు షాకయ్యారు. ఓ కేసులో భాగంగా జార్ఖండ్ రూరల్ డెవలప్‌ శాఖలో పని చేశారు మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్. ఆయన 2023లో అవినీతి ఆరోపణల కిందట అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ పలుచోట్ల సోదాలు చేపట్టింది.

Advertisement

ఈక్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్‌కు సహాయకుడిగా భావిస్తున్న ఓ ఇంట్లోని గది నిండా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల అమలులో వీరేంద్రరాయ్ దాదాపు 100 కోట్ల రూపాయల నొక్కిశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడా సమాచారం ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆధారంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇందులో ఇంకెన్ని తిమింగళాలు బయటపడతాయో చూడాలి.

ALSO READ: ఏది ఏమైనా స్మృతి ఇరానీని ఓడించి తీరుతా’

Advertisement

అసలే దేశంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. నేతలకు సంబంధించి ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. జార్ఖండ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది బీజేపీ. రాష్ట్రంలో అవినీతి ఇంకా పూర్తి కాలేదని, దొరికిన డబ్బును ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు చేపట్టాలన్నది జార్ఖండ్ కమలనాధుల డిమాండ్.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×