BigTV English

ED : డేటా చోరీ కేసు.. ఈడీ యాక్షన్ షురూ..

ED : డేటా చోరీ కేసు.. ఈడీ యాక్షన్ షురూ..

ED : డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈడీ రంగలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మనీలాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా డేటా చౌర్యం జరిగినట్లు తేలడంతో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు . పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా డేటా చోరీ కేసు సంచలనం రేపింది. 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకైనట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేప్టటారు. డేటా చౌర్యం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంలో పని చేస్తున్నవారి డేటాతోపాటు, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో కీలక అంశాలు బయటపడ్డాయి.

డేటా చౌర్యం చేసిన నిందితులు జస్ట్ డయల్ ద్వారా సమాచారాన్ని అమ్మకానికి పెట్టారని పోలీసులు నిర్ధారించారు. వివిధ ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడీ లాంటి వివరాలు సేకరిస్తున్న ముఠా ఆ డేటాను అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. రుణాలు ఇచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయని దర్యాప్తులో తేలింది. రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీల వివరాలు అమ్మకానికి పెట్టడంతో ఆర్మీ ఉన్నతాధికారులు సైబరాబాద్ పోలీసులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది.


Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×