BigTV English
Advertisement

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
Rakesh Tikait

Bharat Bandh : దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్(Rakesh Tikait) తెలిపారు. వ్యాపార, రవాణా సంఘాలు,ప్రజలను ఈ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు.


దేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని తీర్మానించామని టికాయత్‌ తెలిపారు. ఈ బంద్‌లో దేశంలోని అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు పనులకు వెళ్లకుండా వ్యవసాయ సమ్మె పాటించాలన్నారు. అమావాస్య రోజు రైతులు పనులకు వెళ్లరని.. ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్య లాంటిదేనని అన్నారు. ఈ బంద్‌కు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసి మద్దతు తెలపాలని కోరారు. పంటకు మద్దతు ధర కల్పించే చట్టం అమలు, నిరుద్యోగం(Unemployment), అగ్నివీర్‌(Agniveer) పథకం వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలని అని రాకేశ్ టికాయత్‌ స్పష్టం చేశారు.


Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×