E-Paper
Advertisement

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
Rakesh Tikait

Bharat Bandh : దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్(Rakesh Tikait) తెలిపారు. వ్యాపార, రవాణా సంఘాలు,ప్రజలను ఈ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు.

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని తీర్మానించామని టికాయత్‌ తెలిపారు. ఈ బంద్‌లో దేశంలోని అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు పనులకు వెళ్లకుండా వ్యవసాయ సమ్మె పాటించాలన్నారు. అమావాస్య రోజు రైతులు పనులకు వెళ్లరని.. ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్య లాంటిదేనని అన్నారు. ఈ బంద్‌కు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసి మద్దతు తెలపాలని కోరారు. పంటకు మద్దతు ధర కల్పించే చట్టం అమలు, నిరుద్యోగం(Unemployment), అగ్నివీర్‌(Agniveer) పథకం వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలని అని రాకేశ్ టికాయత్‌ స్పష్టం చేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×