BigTV English

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..

Bharat Bandh : ఫిబ్రవరి 16న భారత్ బంద్.. వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
Rakesh Tikait

Bharat Bandh : దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్(Rakesh Tikait) తెలిపారు. వ్యాపార, రవాణా సంఘాలు,ప్రజలను ఈ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు.


దేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని తీర్మానించామని టికాయత్‌ తెలిపారు. ఈ బంద్‌లో దేశంలోని అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు పనులకు వెళ్లకుండా వ్యవసాయ సమ్మె పాటించాలన్నారు. అమావాస్య రోజు రైతులు పనులకు వెళ్లరని.. ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్య లాంటిదేనని అన్నారు. ఈ బంద్‌కు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసి మద్దతు తెలపాలని కోరారు. పంటకు మద్దతు ధర కల్పించే చట్టం అమలు, నిరుద్యోగం(Unemployment), అగ్నివీర్‌(Agniveer) పథకం వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలని అని రాకేశ్ టికాయత్‌ స్పష్టం చేశారు.


Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×