E-Paper
Advertisement

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Two killed in Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలో గల ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. తలనగరి ప్రాంతంలో.. ఇనుమును కరిగించే కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవ్వగా.. డజన్ మందికి పైగా వర్కర్లు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో అమర్చి ఉన్న ఫర్నేస్ లో ఇనుమును కరిగిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

పేలుడు ఘటన తర్వాత.. కంపెనీ నుంచి మంటలు భారీగా ఎగసి పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇనుమును కరిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు మృతుల్లో ఒకరి బంధువులు తెలిపారు. ఇనుము లావా కొందరు యువకులపై పడటంతో.. వారు కూడా గాపడ్డారు.

ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ కు సమాచారమివ్వగా.. రెస్క్యూ టీమ్ ఫ్యాక్టరీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×