E-Paper
Advertisement

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు
Advertisement

Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో ఓ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఒక షాపులో మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ వేగంగా వ్యాపించాయి. చాలా వరకు షాపులు దగ్దమయ్యాయి. ఈ మంటలను చూసి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగు పెట్టారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.

గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ఓ షాపులో ఈ రోజు ఉదయం  10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఇతర ప్లాట్ ఫామ్‌లపై గల దుకాణాలకు వ్యాపించాయి. అప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌లపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ మంటల గురించి రైల్వే పోలీసులు, బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే పనిలో పడ్డారు.

Advertisement

Also Read: RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు

రెండు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సియల్డా సౌత్ సెక్షన్‌ రైళ్ల సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×