E-Paper
Advertisement

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. భారీ వర్షం కారణంగా గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారులు పెద్ద సాహసమే చేశారు. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలో నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి వారు ఉన్న కొండపైకి చేరుకున్నారు.

గిరిజనులు తల దాచుకున్న గుహకు ఎదురుగా ఉన్న లోయ వద్దకు.. గుహలో ఉన్న తన భర్త, పిల్లల  ఆహారం కోసం బయటకు వచ్చిన మహిళలను అధికారులు గుర్తించారు. అనంతరం ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న నలుగురు పిల్లలు, భార్యా భర్తలతో కూడిన కుటుంబం గురించిన ఆచూకీని అధికారులకు చేరవేసారు. గుహలో చిక్కుకున్న వారు వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్మునిటీకి చెందిన కుటుంబం అని ఫారెస్ట్ అధికారి హషీష్ వెల్లడించారు. అటవీ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారులను సీఎం విజయన్ ప్రశంసించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×