E-Paper
Advertisement

Lake: భారత్‌లో మొట్టమొదటిసారి గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం

Lake: భారత్‌లో మొట్టమొదటిసారి గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం
Advertisement

Lake: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరస్సుల్లో ఒకటి లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు. సముద్రమట్టానికి 13,862 అడుగుల ఎత్తులో 70 చదరపు కిలోమీటర్లు ఈ సరస్సు విస్తరించి ఉంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.

అయితే గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ పోటీ జరగనుంది. భారత్‌లో మొట్టమొదటిసారి ఇటువంటి పోటీని నిర్వహిస్తున్నారు. 21 కిలోమీటర్ల ఈ మారథాన్ పరుగు లుకుంగ్ నుంచి ప్రారంభమై మాన్ గ్రామం వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో 50 మంది విదేశీ అథ్లెట్లు, 25 మంది స్వదేశీ అథ్లెట్లు మొత్తం 75 మంది పాల్గొననున్నారు. వారికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించినాకే పోటీలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదుకానున్న ఈ మారథాన్‌కు లాస్ట్ రన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కార్యక్రమం నిర్వహణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు ఈ మారథాన్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×