E-Paper
Advertisement

PM Modi: పీఎం మోదీపై ఏఐ టూల్ “జెమిని” వివాదాస్పద సమాధానం.. గూగుల్‌ రియాక్షన్‌ ఇదే..

PM Modi: పీఎం మోదీపై ఏఐ టూల్ “జెమిని” వివాదాస్పద సమాధానం.. గూగుల్‌ రియాక్షన్‌ ఇదే..

PM Modi:

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్ కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ “జెమిని” ఇచ్చిన సమాధానం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గూగుల్ శనివారం స్పందించింది. సమకాలీన, రాజకీయ అంశాలక సంబంధించి తమ చాట్ బాట్ అన్ని సార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపింది.

ఏఐ టూల్ జెమిని మోదీపై ఏం సమాధానం చెప్పిందంటే.. ప్రధాని మోదీ ఫాసిస్టా..? అని ఓ నెటిజన్ ప్రశ్న అడిగారు. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా , స్పష్టంగా చెప్పలేం అని సమాధానాన్ని దాటవేసింది. ఇది సోషల్ మీడియలో వైరల్ అవ్వడంతో గూగుల్ పక్షపాతంగా పని చేస్తోందంటూ నెట్టింట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘంచినట్లే అవుతుందని, దీనిపై చర్యలు తప్పవంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు.

అయితే ఈ క్రమంలోనే గూగుల్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. జెమిని ని మేము ఓ సృజనాత్మక టూల్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అయితే సమకాలీన, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు ఈ టూల్ ప్రతిసారీ విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చన్నారు. ఈ విషయంలో తమ ఏఐ ను మరింత ఖచ్చితత్వంతో పని చేసేలా అభివృద్ది చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వివరణ ఇచ్చారు.

Read More: ఫేక్ ఐఫోన్ డెలివరీ.. కస్టమర్ ఆగ్రహం.. స్పందించిన అమెజాన్..

కాగా గూగుల్ ఇచ్చిన వివరణఫై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఖచ్చితత్వం లేని వేదికలు, అల్లారిథమ్ లపై తమ డిజిటల్ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదన్నారు. యూజర్లకు డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడం మాధ్యమాల చట్టపరమైన బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో చట్టాల నుంచి మినహాయింపు పొందలేరన మంత్రి హెచ్చరించారు.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×