BigTV English
Advertisement

Good News for Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంపు

Good News for Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంపు

Modi Govt Increases MSP for 6 Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. ఈ మేరకు గోధుమలపై రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది.


అలాగే, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గానూ రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. క్వింటా గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా, రూ.150 పెంచడంతో గతంలో రూ.2,275గా ఉన్న కనీన మద్దతు ధర పెరిగింది. దీంతో రూ.2,425 చేరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.


Also Read: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

అదే విధంగా క్వింటా ఆవాలుకు అత్యధికంగా రూ.300 పెంచగా.. క్వింటాల్ పెసరకు రూ.275, శెనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దు తిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచారు. దీంతోపాటు యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ. 2,642 కోట్ల వ్యయ అంచనాలు వేశారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×