E-Paper
Advertisement

Half Day Office : ఒంటిపూటే ఆఫీసులు.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Half Day Office : ఒంటిపూటే ఆఫీసులు.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
Advertisement

Half Day Office : ఒకపూటే విధులు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మే 2 నుంచి ఉదయం 7.30 గంటలకు డ్యూటీకి రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగిసిపోతాయి. జూలై 15 వరకు కొత్త పనివేళలు అమలవుతాయి. వేసవిలో ఇలా ఉద్యోగులకు తీపికబురు చెప్పింది పంజాబ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

సాధారణంగా వేసవిలో పిల్లలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించింది పంజాబ్ ప్రభుత్వం . ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్‌ లోడ్‌ కూడా తగ్గుతుందని సీఎం చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్‌పై లోడ్‌ అధికంగా ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారని.. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్‌ 300-350 మెగావాట్లు తగ్గుతుందన్నారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని ప్రకటించారు.

Advertisement

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణశాఖ ప్రకటించింది. బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఏప్రిల్‌- జూన్‌ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరించింది. వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు. సమ్మర్ హాలీడేస్ ఇంట్లో ఉండే పిల్లలతో ఎక్కువసేపు గడిపే అవకాశం దొరుకుతుందని సంతోష పడుతున్నారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×