E-Paper
Advertisement

Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం

Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం

Mumbai Rains: భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దవుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు 24 గంటల్లోనే ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సినల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ వెల్లడించింది. అంతే కాకుండా ట్రాంబేలో 241 మిల్లీ మీటర్ల గరిష్ట వర్షాపాతం నమోదైట్లు తెలిపింది.

వడాలాలో 223 మి.మీ,ఘట్ కోపర్‌లో 215 మి.మీ, వర్లీలో 204 మి.మీ, సెవ్రిలో 203 మి.మీ, బీకేసీలో 199 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మరో వైపు కుండపోత వర్షాలకు మహా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నవీ ముంబై మున్సినపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వాహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైళ్లు విమానల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×