BigTV English

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!

Kangana Ranaut latest news(Current news from India): హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం బిజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. హిమాచల్ రాష్ట్రంలోని మంది లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికలు గెలిచారు. కానీ ఆమె పోటీ చేసి ఎన్నికలు చెల్లవంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. మంది ఎన్నికల్లో తాను కూడా పోటీ చేసేందుకు నామినేషన్ వేశానని.. కానీ ఎన్నికల అధికారి అకారణంగా తన నామినేషన్ పేపర్లు తిరస్కరించాడని పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటీషన్ ని విచారణ కోసం అనుమతిస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.


మండి లోక్ సభ స్థానం నుంచి బిజేపీ ఎంపీ కంగాన్ రనౌత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అమెకు 5,37,002 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య.. 4,62,267 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు చెల్లుబాటు కాదంటూ లాయక్ రామ్ నేగీ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. అటవీ శాఖ అధికారి ప్రభుత్వ ఉద్యోగం నుంచి ముందస్తు రిటైర్ మెంట్ తీసుకొని ఎన్నికల్లో పోటీచేశానని.. ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి తప్పుడు కారణాలతో తన నామినేషన్ దరఖాస్తు తిరస్కరించాడని కోర్టుకు తెలిపాడు.

పిటీషన్ లో లాయక్ రామ్ నేగీ.. ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై కూడా కేసు వేశాడు. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా ఎన్నికల అధికారి.. తాను పనిచేసిన డిపార్ట్‌మెంట్ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ కూడా సమర్పించానని.. అయినా మరుసటి రోజు మళ్లీ కరెంటు, నీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని కేవలం ఒకరోజు గడువు ఇచ్చారని.. ఆ డాకుమెంట్స్ కూడా సమర్పిస్తే.. కారణం చూపకుండా తన నామినేషన్ తిరస్కరించారని పిటీషన్ లో పేర్కొన్నాడు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. కచ్చితంగా విజయం సాధించేవాడినని లాయక్ రామ్ నేగి వాదన.


Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

ఇప్పుడు మంది నియోజకవర్త ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదని.. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అతను దాఖలు చేసిన పిటీషన్ పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్పందిస్తూ.. కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు ఆగస్టు 21 వరకు గడువు విధించింది.

 

 

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×