E-Paper
Advertisement

Howarh-CSMTExpress derailed: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

Howarh-CSMTExpress derailed: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

Howrah-CSMT Express derailed updates(Telugu breaking news): జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, దాదాపు 60 మంది గాయపడినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేశారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ హౌరా నుంచి ముంబైకి వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.

రెండు రోజుల కిందట ఇదే రూట్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అదే రూట్లో హౌరా-ముంబై మెయిల్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టాటానగర్-చక్రధర్‌పూర్ సెక్షన్ మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదం కారణంగా చాలా రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని ప్రత్యా మ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.

ALSO READ: వయనాడ్ జిల్లాలో కొండచరియల బీభత్సం, ఏడుగురు మృతి..ఇంకా

ప్రమాదానికి గురైన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాత్రి 11 గంటలకు చక్రధర్‌పూర్ రావాల్సివుంది. టాటా‌నగర్‌కు అర్థరాత్రి రెండున్నర గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి నెమ్మదిగా చక్రధర్‌పూర్‌కు వెళ్తోంది. ఈలోగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. గూడ్స్‌ని ఢీకొట్టింది. వెంటనే 18 బోగీలు పట్టాలు తప్పాయని బాధితులు చెబుతున్నమాట. ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×