Encounter: ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లలో ఇది ఒకటి. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల ఉనికి ఉందా..? అనే కోణంలో బలగాలు గాలిస్తున్నాయి.
ఈ ఎన్కౌంటర్లో జవాన్లు వీరోచితంగా పోరాడారు. వీరమరణం పొందిన సైనికుల త్యాగానికి దేశం నివాళులర్పిస్తోంది. మావోయిస్టుల కదలికలు, వారి ఏరివేతపై భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: CM Revanth Reddy: త్వరలోనే మరో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన