BigTV English

India China Border : సరిహద్దులో మళ్లీ భారత్ చైనా ఘర్షణ..

India China Border : సరిహద్దులో మళ్లీ భారత్ చైనా ఘర్షణ..

India China Border : భారత్ చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టాద్ వద్ద చైనా వాస్తావాధీన రేఖను దాటి భారత్‌లోకి పెట్రోలింగ్‌కి వచ్చాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 7 నుంచి 20 మంది భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.


అటు చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులే ఈ ఘర్షణలో ఎక్కువగా గాయపడ్దారు. చైనా పెట్రోలింగ్ సమయంలో హద్దులు దాటి భారత భూభాగంలొకి ప్రవేశిస్తుంది. దీన్ని గమనించిన భారత్ సరిహద్దులో ఫైటర్ జట్లతో గస్తీ కాస్తోంది.

ఇటీవల భారత్, అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు చేశాయి. యుద్ధ అభ్యాస్ 2022 పేరుతో నవంబర్ 17 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌లో ఈ విన్యాసాలు జరిగాయి.


ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన వారం తరువాత చైనా పెట్రోలింగ్‌లో సరిహద్దు వద్ద హద్దు మీరింది. మరో వైపు భారత్-చైనా సరిహద్దు విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని చైనా గతంలో అమెరికాను హెచ్చరించింది. యుద్ధ విన్యాసాలు భారత్‌తో ఎవరకు చేయాలో కూడా మూడో దేశం చెప్పవలసిన అవసరం లేదన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×