E-Paper
Advertisement

USA: అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి.. డెత్ నెం. 5..

USA: అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి.. డెత్ నెం. 5..

Indian origin student dies in USA: అమెరికాలో మరో భారత సంతతి మరో విద్యార్థి మృతి చెందాడు. ఇది ఈ సంవత్సరంలోనే చోటుచేసుకున్న ఐదో ఘటన కావడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది.

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న సమీర్‌ కామత్‌ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. సోమవారం సాయంత్రం స్థానిక నేచర్‌ రిజర్వ్‌ వద్ద అతడు విగతజీవిగా కన్పించినట్లు అధికారులు వెల్లడించారు.

23 ఏళ్ల సమీర్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. గతేడాది ఆగస్టులో అతడు మాస్టర్స్‌ పూర్తి చేశాడు. పీహెచ్‌డీలో చేరాడు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫోరెన్సిక్‌ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. భారత మూలాలున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఈ ఏడాదిలో ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.

కాగా.. ఇటీవల పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత సంతతి విద్యార్థి నీల్‌ ఆచార్య కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కొన్ని గంటల పాటు అతడు ఎవ్వరికీ కనిపించలేదు. దీంతో పోలీసులు గాలించగా అతని మృతదేహం లభ్యమైంది. గతవారం ఒహాయోలో భారత-అమెరికన్‌ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి మరణించాడు. ఇక, జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్‌ సైనీ ఓ నిరాశ్రయుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. జనవరిలో మరో భారతీయ విద్యార్థి అకుల్‌ ధవన్‌ ఇల్లినాయ్‌ యూనివర్సిటీ వెలుపల శవమై కనిపించాడు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×