BigTV English
Advertisement

Bullet Train: 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!

Bullet Train: 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!
Indias First Bullet Train
Indias First Bullet Train

Bullet Train: బుల్లెట్ రైలును వేగంగా పట్టాలకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైభవ్ స్వయంగా వెల్లడించారు. రైజింగ్ భారత్ సమిత్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తొలివిడత గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోర ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ రెండు ప్రాంతాల మధ్య పనులు చకచకా సాగుతున్నాయి. బుల్లెట్ రైలు పట్టాలకు ఎక్కించడానికి విధించిన గడువు ఆరేళ్లు. మొత్తం 2028 నాటికి పూర్తి చేయాలన్నది మంత్రి వైభవ్ ఆలోచన. ముంబై-అహ్మదాబాద్ ల మధ్య రైలు నడవనుంది. దీనికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు మంత్రి.

ఇదికాకుండా ఇండియాలోని పలు సిటీల్లో రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు ఆలోచన చేసింది కేంద్రం. రెండేళ్ల కిందట పార్లమెంటు వేదికగా ప్రకటన చేసింది. ఏడు కారిడార్లలో ట్రాక్, టెక్నాలజీ అప్ గ్రేడ్ చేయాలన్నది అందులోని సారాంశం. భవిష్యత్తులో రైల్వే ఉద్యోగులు హ్యాపీగా ఉంటారన్నది మంత్రి మాట. గత ప్రభుత్వాలు రైల్వేను కేవలం పొలిటికల్ టూల్ గా మాత్రమే ఉపయోగించుకున్నారని చివరలో సెటైర్లు వేశారు మంత్రి అశ్విని.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×