E-Paper
Advertisement

INDIA Alliance Meet: రెండోరోజు విపక్షాల కూటమి సమావేశం.. ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రకటిస్తారా..?

INDIA Alliance Meet:  రెండోరోజు విపక్షాల కూటమి సమావేశం.. ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రకటిస్తారా..?

INDIA alliance parties meeting updates(Political news telugu) :

మోదీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల కూటమి ఇండియా వ్యూహాలకు పదునుపెడుతోంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని కూటమి నేతలు మరోసారి స్పష్టం చేశారు. ముంబైలో గురువారం విపక్షాల సాధారణ సమావేశం జరిగింది. శుక్రవారం ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు.

రెండోరోజు సమావేశంలో కూటమికి కన్వీనర్‌ నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎంపీ సీట్ల షేరింగ్‌పై సబ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపై రెండో రోజు భేటీలో విపక్షాల నేతలు చర్చించనున్నారు.

తొలిరోజు సమావేశానికి 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తాయి.

రెండోరోజు సమావేశం తర్వాత కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్‌ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కూటమి లోగోను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×