E-Paper
Advertisement

INDIA Alliance Meet: రెండోరోజు విపక్షాల కూటమి సమావేశం.. ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రకటిస్తారా..?

INDIA Alliance Meet:  రెండోరోజు విపక్షాల కూటమి సమావేశం.. ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రకటిస్తారా..?
Advertisement

INDIA alliance parties meeting updates(Political news telugu) :

మోదీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల కూటమి ఇండియా వ్యూహాలకు పదునుపెడుతోంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని కూటమి నేతలు మరోసారి స్పష్టం చేశారు. ముంబైలో గురువారం విపక్షాల సాధారణ సమావేశం జరిగింది. శుక్రవారం ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు.

రెండోరోజు సమావేశంలో కూటమికి కన్వీనర్‌ నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎంపీ సీట్ల షేరింగ్‌పై సబ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపై రెండో రోజు భేటీలో విపక్షాల నేతలు చర్చించనున్నారు.

Advertisement

తొలిరోజు సమావేశానికి 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తాయి.

రెండోరోజు సమావేశం తర్వాత కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్‌ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కూటమి లోగోను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×