KTR: స్వేచ్ఛ, బ్యూరో: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల శిశివును హత్యచేసిన దోషులందరినీ అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ఈ సంఘటన మాటలకు అందని మహావిషాదమని, మాయని మచ్చ అని, రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సి ఉందన్నారు.
Also Read: Negative Energy: మీ ఇంట్లో సుఖశాంతులు లేవా ? అయితే.. పూజా గదిలో ఈ చిన్న మార్పు చేసి చూడండి !
బాధిత కుటుంబానికి పార్టీ తరపున 10లక్షలతో ఇల్లు నిర్మిస్తామన్నారు. అలాగే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నని, ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వస్తే ప్రాణాలను బలితీస్తారా అని ప్రశ్నించారు. ఏ శతాబ్దంలో మనం ఉన్నామో గుర్తించుకోవాలని అన్నారు. హంతకులకు అండగా ఉన్న ఎవరినైనా సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి శిక్షించాలన్నారు. పోలీసులు బాధితులకు అండగా ఉండకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
Also Read: Lord Krishna: జీవితం ఒక కురుక్షేత్రం అయితే.. శ్రీకృష్ణుడి ఈ 7 సూత్రాలే మీ విజయానికి ఆయుధాలు!