E-Paper
Advertisement

IT Notice to Congress: ముమ్మాటికీ మోదీ సర్కార్ పనే? మళ్లీ నోటీసులు..! అసలు, వడ్డీ కలిసి ఈసారి..

IT Notice to Congress: ముమ్మాటికీ మోదీ సర్కార్ పనే? మళ్లీ నోటీసులు..! అసలు, వడ్డీ కలిసి ఈసారి..
Advertisement

indian national congress latest news

IT Notice to Congress(Political news telugu):లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ అంశంలో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. నోటీసుల విషయాన్ని కాంగ్రెస్ అడ్వకేట్, ఎంపీ వివేక్ తంఖా శుక్రవారం తెలిపారు.

Advertisement

తమపై ఐటీ శాఖ ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. వెంటనే ఆ పార్టీకి నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ. 2017-18 నుంచి 2020-21 వరకు సంబంధించిన పెనాల్టీ, వడ్డీ కలిసి 1700 కోట్ల రూపాయలను తేల్చింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నేరుగా నోటీసులు ఇవ్వడంపై ఎంపీ వివేక్ తంఖా మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామిక చర్యగా వర్ణించారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులు గురిచేయడానికి మోదీ సర్కార్ ప్లాన్ చేసినట్టు దుయ్యబట్టారు. దీనిపై చట్టపరంగా ఫైట్ చేస్తామన్నారు.

ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గతంలోనూ 2014 నుంచి 2017 వరకు సంబంధించిన ఐటీ వ్యవహారాలపై న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు 135 కోట్ల రూపాయలను రికవరీ చేసుకుంది ఐటీ విభాగం.

Advertisement

 

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×