Jammu Kashmir Suicide Attack : పోలీసులు, ఆర్మీ దళాలు కలిసి జమ్ము కశ్మీర్లో సూసైడ్ అటాక్ను భగ్నం చేశాయి. ఈ ఘటన అనంతనాగ్, పుల్వామా జిల్లాలో చోటుచేజుకున్నాయి. అవంతిపురాలో ఆర్మీ దళాలు క్యాంప్ బేస్ను ఏర్పాటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆత్మహుతి ద్వారా ఆక్యాంప్ పై అటాక్ చేద్దామనుకున్నాయి. దీన్ని గమనించిన ఆర్మీ దళాలు, పోలీసులు కలిసి ఈ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.
లష్కరే తోయిబా కమాండర్ ముక్తార్ భట్, విదేశీ ఉగ్రవాది మరో ఉగ్రవాది కలిసి ఆత్మహుతి దాడికి ప్లాన్ చేశారు. భద్రతా దళాలు చాకచక్యంగా వీరిపై అటాక్ చేసి ఆత్మాహుతి దాడిని నివారించాయి. అయితే ఈ ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఓ ఏకె-47, ఏకె-46, పిస్తోల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మాహుతి దాడికి కమాండర్గా వ్యవహరించిన ముక్తార్ భట్ గతంలో ఓ సీఆర్పీఎఫ్ సబ్ఇన్స్పెక్టర్, రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్ సిబ్బందిని హత్య చేసినట్లు కేసు నమోదైంది. అనంతనాగ్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన షకీర్ అహ్మద్ను కూడా ఎన్కౌంటర్ చేశాయి భద్రదా దళాలు.