E-Paper
Advertisement

JEE Main Admit Cards : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

JEE Main Admit Cards : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

JEE Main Session 2 Admit Cards Release : జేఈఈ మెయిన్ (సెషన్ -2) పరీక్ష అడ్మిట్ కార్డులను ఎన్ టీఏ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకూ జరగనున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఇటీవలే విడుదలయ్యాయి. 4,5,6 తేదీల్లో జరగనున్న బీఈ, బీటెక్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.

అడ్మిట్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకునే విద్యార్థులు https://jeemainsession2.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card లింక్ ను ఓపెన్ చేసి.. మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డు వస్తుంది. కాగా.. ఏప్రిల్ 8,9 తేదీలలో పేపర్ -1, 12న పేపర్ 2 ఎ, బి పరీక్షలు జరగనున్నాయి. వాటికి త్వరలోనే అడ్మిట్ కార్డుల్ని విడుదల చేయనుంది.

Also Read : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..

ఇటీవలే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల తేదీలను మార్చింది. తొలుత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రెండు షిఫ్టుల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న.. పేపర్ 2A (B. Arch), పేపర్ 2B (B.Planning), పేపర్ 2A & 2B (B.Arch & B. ప్లానింగ్ రెండూ) మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:00 నుండి 12:30 వరకు నిర్వహించబడతాయి. దేశం వెలుపల ఉన్న 22 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 319 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×