E-Paper
Advertisement

JEE Main Exams : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..

JEE Main Exams : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..
Advertisement

JEE Main Exmas 2024 New Schedule : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) సెషన్ 2 పరీక్షల తేదీలను మరోసారి సవరించింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ (Joint Entrance Examination) పరీక్షలు ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తాయని తెలిపింది.

Advertisement

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ ను jeemain.nta.ac.in లో చూడవచ్చు. తొలుత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బోర్డు పరీక్షల కారణంగా.. తాజాగా ఆ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేసింది.

Also Read : జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. 31న అడ్మిట్ కార్డుల!

Advertisement

తాజా షెడ్యూల్ ప్రకారం.. JEE మెయిన్ ఏప్రిల్ 2024 సెషన్ పేపర్ 1 (B.E./B.Tech) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుంది. పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న.. పేపర్ 2A (B. Arch), పేపర్ 2B (B.Planning), పేపర్ 2A & 2B (B.Arch & B. ప్లానింగ్ రెండూ) మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:00 నుండి 12:30 వరకు నిర్వహించబడతాయి. దేశం వెలుపల ఉన్న 22 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 319 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×