E-Paper
Advertisement

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?
Advertisement

Parliament Session: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటులో తన తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ దుమారాన్ని రేపే కంగనా రనౌత్ తొలి ప్రసంగంలో ఏమి మాట్లాడారా? అనే ఆసక్తి సహజంగానే ఏర్పడుతుంది. తన తొలి ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అంతరించిపోయే దశలో ఉన్న గిరిజన సంగీతం, జానపద కళల గురించి ఆమె వివరించారు.

పార్లమెంటులో మండి ప్రజల గొంతును వినిపించే అవకాశాన్ని తనకు కల్పించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హిందీలో ఆమె మాట్లాడుతూ.. ‘మండిలో అనేక రకాల కళలు అంతరించిపోయే దశకు చేరాయి. మా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణ విధానం ఉన్నది. దాన్ని కత్ కుని అంటారు. ఇది కూడా అంతరించిపోయేలా ఉన్నది. గొర్రె ఉన్నితో అనేక రకాల జాకెట్లు, క్యాపులు, శాలువాలు, స్వెటర్లను తయారు చేస్తారు. ఇలాంటి వాటిని విదేశాల్లో చాలా విలువైనవిగా పరిగణిస్తారు. కానీ, ఇక్కడ ఆ పద్ధతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. వీటిని పునరుజ్జీవం గావించడానికి, ప్రమోట్ చేయడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటిపై మాట్లాడాలని కోరుకుంటున్నాను’ అని కంగనా రనౌత్ తెలిపారు.

Advertisement

Also Read: కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం: మంత్రి పొన్నం

‘అలాగే, హిమాచల్ ప్రదేశ్ జానపద కళ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించదలిచాను. ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మోర్ సహా పలు గిరిజన సంగీత కళారూపాలు అంతరించేపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం’ అని ఆమె అడిగారు.

Advertisement

ఇందుకు సంబంధిచిన వీడియోను కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు. నేడు పార్లమెంటులో మండి ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించే అవకాశం దక్కింది అంటూ పేర్కొని ఈ వీడియోను పోస్టు చేశారు.

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×