E-Paper
Advertisement

AAP Star Campaigners: గుజరాత్ ఆప్ స్టార్ క్యాంపెయినర్లు వీరే.. లిస్ట్‌లో కేజ్రీవాల్, సునీత, సిసోడియా..

AAP Star Campaigners: గుజరాత్ ఆప్ స్టార్ క్యాంపెయినర్లు వీరే.. లిస్ట్‌లో కేజ్రీవాల్, సునీత, సిసోడియా..
Advertisement

AAP Star Campaigners: లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలను రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం గుజరాత్‌లో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆప్ మంగళవారం విడుదల చేసింది.

అదనంగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. వీరి పేర్లను పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.

Advertisement

ఆ జాబితాలో ఉన్న ఇతర ప్రముఖులు ఆప్ రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ కూడా ఉన్నారు. ముఖ్యంగా, కొత్తగా చేరిన ఆప్ రాజ్యసభ ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో లేవు. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారిక నివాసం నుంచి గత నెలలో అరెస్టు చేసిన వెంటనే సునీతా కేజ్రీవాల్ పార్టీలో ప్రాధాన్యతను పెంచుకున్నారు.

సునీతా కేజ్రీవాల్ అప్పటి నుంచి ఆప్ నాయకులు, ప్రతిపక్షం నేతృత్వంలోని ఇండియా బ్లాక్ సభ్యులతో అనేక సమావేశాలు నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె అరవింద్ కేజ్రీవాల్ తరఫున వీడియో సందేశాలు కూడా విడుదల చేశారు.

Advertisement

Also Read: బ్యాలట్ ఓటింగ్‌తో ఏం జరిగిందో మేము మర్చిపోలేదు: సుప్రీం కోర్టు

గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమిలో భాగంగా రెండు నియోజకవర్గాలు భరూచ్, భావ్‌నగర్‌లో బరిలో దిగుతోంది. ఆప్ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ మిగిలిన 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. భరూచ్‌లో ఆప్ చైతర్ వాసవకు టికెట్ కేటాయించారు. భావ్‌నగర్‌లో ఉమేష్ మక్వానా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.

గుజరాత్ లో లోక్ సభ ఎన్నికలు మే 7న ఒకే దశలో జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×