Kerala Landslide: కేరళలో ఓ పక్కన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వర్షాల కారణంగా అక్కడ కొండచరియలు విరిగిపడ్డుతున్నాయి. తీవ్ర విపత్తులు అక్కడ సంభవిస్తుండటంతో అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే అక్కడి విపత్తుల గురించి బిగ్ టీవి లైవ్ జరుగుతున్న సమయంలోనే లైవ్ లోనే ఓక్కసారిగా కొండ చరియులు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపైకి ఎవరు రావద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెల్లాలని ప్రభుత్వం తెలిపింది. కేరళలో ప్రకృతి బీభత్సం గురించి తెలియచేయడానికి అక్కడి ప్రాంతానికి బిగ్ మీడియా ప్రతిధుల బృందం వెల్లింది. దీంతో అక్కడి సమస్యను లైవ్లో చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై పక్కకు వచ్చారు. దృష్యాలన్ని బిగ్ టీవి కెమెరాకు లైవ్లో రికార్డయ్యాయి. కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లా పానకాడు సమీపంలో ఈ సంఘటన జరిగింది.
Also read: వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్లో
భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి దాదాపుగా మూడు అడుగులలోతు వరకు రోడ్లపై బురద చేరిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న వారు అప్రమత్తమై సురక్షిత ప్రాంతం వైపు పరుగులు తీసారు. ఈ ప్రమాదంలో బిగ్ టీవి లైవ్ ప్రతినిధి ప్రశాంత్ అనే వ్యక్తి కింద పడిపోగా అక్కడున్నవారు అతడిని రక్షించారు.
Also read: నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్