E-Paper
Advertisement

Lok Sabha Phase 2 Voting: ఓటు వేసిన ప్రముఖులు.. ఏం చెప్పారంటే..?

Lok Sabha Phase 2 Voting: ఓటు వేసిన ప్రముఖులు.. ఏం చెప్పారంటే..?

Lok Sabha Phase 2 Voting: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 13 రాష్ట్రాలలోని 88 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే, ఈ పోలింగ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ రచయిత సుధా మూర్తి బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారని, కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదని, అలా ఉండొద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఇంట్లో కూర్చోవొద్దు.. బయటకి వచ్చి ఓటు వేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.. అది మీ హక్కు అంటూ ఆమె చెప్పారు.

Also Read:

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాలావర్ లో బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం అభివృద్ధి కావాలనుకుంటోంది.. ఖచ్చితంగా దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి ప్రహ్లద్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×