BigTV English

Lok Sabha Phase 2 Voting: ఓటు వేసిన ప్రముఖులు.. ఏం చెప్పారంటే..?

Lok Sabha Phase 2 Voting: ఓటు వేసిన ప్రముఖులు.. ఏం చెప్పారంటే..?

Lok Sabha Phase 2 Voting: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 13 రాష్ట్రాలలోని 88 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే, ఈ పోలింగ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ప్రముఖ రచయిత సుధా మూర్తి బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారని, కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదని, అలా ఉండొద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఇంట్లో కూర్చోవొద్దు.. బయటకి వచ్చి ఓటు వేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.. అది మీ హక్కు అంటూ ఆమె చెప్పారు.

Also Read:


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాలావర్ లో బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం అభివృద్ధి కావాలనుకుంటోంది.. ఖచ్చితంగా దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి ప్రహ్లద్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×