E-Paper
Advertisement

Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు.. మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతి..

Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు.. మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతి..
Current news from india

Gyanvapi case update today(Current news from India):

జ్ఞానవాపి కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మసీదు ప్రాంగణంలోని దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు.. హిందువులకు అనుమతించింది. పూజలు చేసుకునేలా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

మసీదు ప్రాంగణంలో.. హిందూ దేవుళ్ల విగ్రహాలు, పలు శాసనాలు ఉన్నట్లు ఆర్కియాలజీ సర్వేలో వెల్లడైంది. వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ఆర్కియాలజీ అధికారులు నివేదికలో తెలిపారు. హనుమంతుడు, విష్ణువు విగ్రహాలు ఉన్నాయని తాజాగా బయటకు వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది.

నాలుగు చేతులతో ఉన్న సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. అలాగే విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు దొరికాయి. వాటిని మధ్యయుగ ప్రారంభం కాలం నాటివిగా గుర్తించారు. ఇందులో ఒక విగ్రహం నాలుగు చేతులున్నాయి.అందులో మూడు చేతులు, ముఖం దెబ్బతిని ఉన్నాయి. ఓ పీఠంపైన నిలబడిన ఆకారంలో ఉంది. మరొటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్టుగా ఉంది. మరో శిల్పం హనుమంతుడి పైభాగానికి సంబంధించినది.

ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న వారణాసి జిల్లా కోర్టు హిందువుల పూజలకు అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

.

.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×