BigTV English
Advertisement

Amritpal Singh To File Nomination: ఎన్నికల బరిలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్,

Amritpal Singh To File Nomination: ఎన్నికల బరిలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్,

Amritpal Singh To File Nomination: ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాడు. ఈసారి పంజాబ్‌లోకి ఖడూర్ సాహిబ్ లోక్‌సభ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను వెయ్యి రూపాయలుగా చూపించాడు.


మూడుపదుల వయసున్న ఆయన, వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థకు అధ్యక్షుడు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి, అస్సాంలోకి దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ఆయన తరపు నామినేషన్  పత్రాలను బంధువులు శుక్రవారం ఎన్నికల అధికారికి అందజేశారు. అందులో ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు.

ఎస్బీఐలో కేవలం వెయ్యి రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన భార్య కిరణ్‌దీప్ కౌర్ పేరిట 18 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపాడు. బంగారం ఆభరణాలు దాదాపు నాలుగు లక్షలు ఉన్నట్లు అందులో తెలిపాడు. ఆమె బ్రిటీష్ జాతీయురాలు. తాను పేరెంట్స్‌పై ఆధారపడి బతుకుతున్నట్లు వెల్లడించాడు.


అమృత్‌పాల్ సింగ్‌పై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేవలం పదో తరగతి మాత్రమే చదివాడు. 2008లో అమృతసర్‌లోని ఓ పాఠశాల నుంచి పాసయ్యాడు. ఖలిస్తాన్ సానుభూతి పరుడైన అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా రకరకాల మారువేషాలతో పంజాబ్ అంతటా తిరిగాడు. గతేడాది మార్చి 18న జలంధర్ జిల్లాలో పోలీసులకు దొరికిపోయాడు.

అమృతపాల్ సింగ్ ఓ స్వీయ బోధకుడు. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో మరణించిన బింద్రన్ వాలా స్టయిల్‌లో బోధకుడి అవతారం ఎత్తాడు. తన బోధనలతో సిక్కులను రెచ్చగొట్టడంలో ఆయన దిట్ట. ప్రత్యేకంగా సిక్కు దేశం కావాలని పోరాడుతున్నాడు. బెదిరింపులకు కేరాఫ్ అడ్రస్‌గా అమృత్‌పాల్ సింగ్  గ్యాంగ్‌ని చాలామంది చెబుతారు. ఇక పంజాబ్‌లో 13 సీట్లకు జూన్ ఒకటిన ఎన్నికల పోలింగ్ జరగనుంది.

 

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×