E-Paper
Advertisement

Kharge : ఆస్కార్ అవార్డులు.. మోదీపై ఖర్గే సరదా సెటైర్లు.. రాజ్యసభలో నవ్వులు..

Kharge : ఆస్కార్ అవార్డులు.. మోదీపై ఖర్గే సరదా సెటైర్లు.. రాజ్యసభలో నవ్వులు..
Advertisement

Kharge : రాహుల్‌ గాంధీ ఇటీవల లండన్‌ కేంబ్రిడ్జ్ యూనివర్శిటిలో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో రచ్చ రేగింది. ఉభయ సభల్లో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అంత వాడీవేడిగా సాగుతున్న సమావేశాల్లో ఆస్కార్ అవార్డుల అంశం ..సరదాగా నవ్వులు పూయించింది. భారత్‌కు రెండు ఆస్కార్‌లు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో సరదా వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాట, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ లఘు డాక్యుమెంటరీ ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్నాయి. అవార్డు గ్రహీతలకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండూ దక్షిణాదికి చెందిన చిత్రాలు కావడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డుల క్రెడిట్‌ను అధికార పార్టీ తీసుకోకూడదనేదే తన విజ్ఞప్తి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Advertisement

భారతీయ చిత్రాలకు ఆస్కార్‌ అవార్డులు రావడం గర్వకారణమని ఖర్గే అన్నారు. అయితీ దీనికి అధికార పార్టీ క్రెడిట్ తీసుకోకూడదన్నారు. మేమే దర్శకత్వం వహించాం.. మేమే రాశాం.. ప్రధాని మోదీ దర్శకత్వం వహించారు.. ఇలా అనొద్దు. అదొక్కటే నా అభ్యర్థన. ఇందులో దేశ సహకారం ఉందని ఖర్గే అన్నారు.

ఖర్గే వ్యాఖ్యలపై విపక్ష నేతలే కాకుండా, అధికార పార్టీ సభ్యులు సరదాగా నువ్వుకున్నారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నవ్వుతూ కనిపించారు. అంతకుముందు పీయూష్‌ గోయల్‌ సైతం ఆస్కార్‌ విజేతలను అభినందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర రచయిత పార్లమెంట్‌ సభ్యుడని విజయేంద్ర ప్రసాద్‌ పేరును ప్రస్తావించారు. ఆయన సహకారాన్ని గుర్తించాలన్నారు. మొత్తంమీద గరగరంగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆస్కార్ అవార్డుల అంశం సరదా వాతావరణాన్ని సృష్టించింది.

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×