E-Paper
Advertisement

Kolkata Doctor Murder Case: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు

Kolkata Doctor Murder Case: కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు
Advertisement

నిజానికి మమతా బెనర్జీ హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయినందుకు హోంమినిస్టర్‌గా ఉన్న మమతా బెనర్జీని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక ఆరోగ్యశాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఏం చేయలేకపోతున్నారని సీఎం మమతా ఏం చేయలేకపోతున్నారని ర్యాలీ చేశారా? బెంగాల్‌ సీఎం, హోంమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అన్ని మమతా బెనర్జీనే.. మళ్లీ ఆమే ర్యాలీ తీయడమే పెద్ద వండర్.. ఇది అసలు నిసిగ్గు వ్యవహారం.. సరే పోనీలేండి ఇదంతా పాత విషయమే.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. కానీ చీమకుకూడా హాని జరగలేదు.. చాలా పకడ్బంధీగా పోలీస్‌ వ్యవస్థ పనిచేసింది.
కానీ ఆ తర్వాత జరిగిన ర్యాలీలన్నింటిలో జరిగింది హింసాకాండే.

Advertisement

ఆర్‌జీ కర్‌ హాస్పిటల్‌లో దారుణానికి వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అదే సమయంలో హాస్పిటల్‌లోకి చొరబడ్డ అల్లరిమూక.. నానా బీభత్సం సృష్టించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేశారు. తరువాత.. నబన్నా అభియాన్.. అంటే చలో సచివాలయం పేరుతో కోల్‌కతాలో ఓ ర్యాలీ నిర్వహించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ జరిగింది. ఇది ఎంత హింసాత్మకంగా మారిందంటే.. చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇది కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వీధుల్లో బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు తన్నుకున్నారు. బీజేపీ నేతలపై దాడులు జరిగాయి.. కాల్పులు జరిగాయి. కొన్ని చోట్లు బాంబులు కూడా పేలాయి. మమతా బెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.

Also Read: ఉపేక్షించింది ఇక చాలు.. మేలుకోండి: కోల్‌కతా రేప్ ఘటనపై రాష్ట్రపతి

Advertisement

మమతా బెనర్జీ ర్యాలీ చేస్తే ప్రశాంతంగా సాగిపోవడం ఏంటి..? వేరే ఎవ్వరూ ర్యాలీకి దిగిన ఈ దాడులు.. అరాచకం నిద్రలేవడం ఏంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. ఓ వైపు ఇలాంటి ఘటనలు రోజుకోకటి జరుగుతుంటే.. మరోవైపు తాను కూడా మద్దతిస్తున్నాను అన్నట్టుగా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆమె లెటెస్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని ట్రైనీ డాక్టర్‌కు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు బెంగాల్ ప్రజలు.. ఆమె గవర్నమెంట్‌పై ఆమె నిరసన తెలపడం ఏంటో.. ఆమెకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థులను, నిరసనకారులను చితకబాదడం ఏంటో.. ఆమెకే తెలియాలి. మొత్తానికి సీబీఐ విచారణను డైవర్ట్ చేసే వాతావరణం క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు..

టీఎంసీ నేతలను ఇదే ప్రశ్న వేస్తే.. ప్రస్తుతం విచారణ కేంద్రం చేతిలో ఉంది కదా అంటున్నారు. కాబట్టి.. విచారణ సీబీఐ జరుపుతుంది కాబట్టి.. మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది బెంగాల్ ప్రభుత్వ వ్యవహార తీరు. ఇప్పటికైనా ఈ పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి అసలు వ్యవహారంపై ఫోకస్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ పట్టించుకునేవారు ఎవరు. అధికారపక్షమైనా.. విపక్షమైనా.. ఎవరి పంచాయతీల్లో వారే ఉన్నారు. ఎవరి పొలిటికల్ గెయిన్‌లో వారే ఉన్నారు.

ఇక సీబీఐ ఇన్వెస్టిగేషన్ విషయానికి వద్దాం..ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త పేరు వినపడింది. అతనే ASI అనూప్ దత్తా.. ఎవరీ అనూప్ దత్తా అనే కదా మీ డౌట్.. మొన్న ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు సీబీఐ పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహించిన సమయంలో ఈ పేరు తెరపైకి వచ్చింది. ఈ అనూప్‌, సంజయ్ మధ్య చాలా మంచి ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. ఇంకా.. హత్యాచారం తర్వాత కూడా సంజయ్‌ అనూప్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ అనూప్‌ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌కు చాలా క్లోజ్ అని సీబీఐ గుర్తించింది. సంజయ్ పోలీస్ క్వార్టర్స్‌లో ఉండటానికి, పోలీస్ వెహికల్‌ను ఉపయోగించుకోవడానికి కూడా అనూపే కారణమని విచారణలో తేలింది. దీంతో అనూప్‌పై ఫోకస్ చేసింది సీబీఐ.. మరి అతడిని కూడా విచారిస్తుందా? అతడికి కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహిస్తుందా? అనేది చూడాలి.. అంతేగాక మొత్తానికి బెంగాల్‌ ప్రజలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తోంది న్యాయం కోసం.. మీ పనికి మాలిన రాజకీయం కాదని పాలకులు ఎప్పుడూ తెలుసుకుంటారో చూడాలి.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×