BigTV English
Advertisement

Teacher Recruitment Scam: హైకోర్టు సంచలన తీర్పు.. ఉద్యోగాలు కోల్పోనున్న 25,753 టీచర్లు!

Teacher Recruitment Scam: హైకోర్టు సంచలన తీర్పు.. ఉద్యోగాలు కోల్పోనున్న 25,753 టీచర్లు!

West Bengal Teachers Recruitment Scam: పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను హైకోర్టు రద్దు చేసింది.


2016లో బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన టీచర్ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించి.. నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

2016లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ స్కూళ్లలో 9, 10, 11, 12వ తరగతుల టీచర్ల పోస్టుల భర్తీకి బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసి.. పరీక్ష నిర్వహించింది. అప్పట్లో 24,650 పోస్టుల భర్తీకి గాను రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాశారు. కాగా, ప్రభుత్వం 25,753 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.


అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యర్థన మేరకు ప్రత్యేక డివిజన్ బెంచ్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బెంచ్ కేసును విచారించి.. 2016 నియామక ప్రక్రియలో భారీ కుంభకోణాలు జరిగినట్లు నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన 25,753 టీచర్ పోస్టుల భర్తీని హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: సుప్రీం సంచలన తీర్పు.. 30 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి..

దీంతో పాటుగా ఇప్పటి వరకూ వారు తీసుకున్న జీతాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పును వెల్లడించింది. వారి వద్ద నుంచి 6 వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా స్థాయి అధికారులను కోర్టు ఆదేశించింది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×