BigTV English
Advertisement

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!

Lok Sabha Polls 2024 BJP CampaigningLok Sabha Polls 2024 BJP Campaigning: మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తోన్న ప్రధాని మోదీ విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇక రానున్న లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ హోలీ తర్వాత మార్చి 25న దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మోదీ ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


అటు దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాలికలను రూపొందించారు. అటు అస్సాంలో 1 లేదా 2 సభలుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో 15కు మించి సభలు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Read More: రాజ్యసభకు సుధా మూర్తి.. నారీ శక్తి అంటే ఇదేనంటూ ప్రధాని మోదీ ట్వీట్..


ఇక మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీ సహా దేశవ్యాప్తంగా సభల్లో పాల్గొననున్నారు. అటు మధ్యప్రదేశ్‌లో సీఎం మోహన్ యాదవ్ ప్రచారాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మతో పాటు ఎంపీ సీఎం ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×