E-Paper
Advertisement

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..!
Advertisement

Lok Sabha Polls 2024 BJP CampaigningLok Sabha Polls 2024 BJP Campaigning: మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తోన్న ప్రధాని మోదీ విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇక రానున్న లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ హోలీ తర్వాత మార్చి 25న దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మోదీ ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

అటు దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాలికలను రూపొందించారు. అటు అస్సాంలో 1 లేదా 2 సభలుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో 15కు మించి సభలు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Advertisement

Read More: రాజ్యసభకు సుధా మూర్తి.. నారీ శక్తి అంటే ఇదేనంటూ ప్రధాని మోదీ ట్వీట్..

ఇక మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీ సహా దేశవ్యాప్తంగా సభల్లో పాల్గొననున్నారు. అటు మధ్యప్రదేశ్‌లో సీఎం మోహన్ యాదవ్ ప్రచారాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మతో పాటు ఎంపీ సీఎం ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×