E-Paper
Advertisement

Bomb Threat to Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అనుమానితుడు అరెస్ట్..!

Bomb Threat to Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అనుమానితుడు అరెస్ట్..!
Advertisement

Bomb threat to Air India Flight: కొచ్చిన్ నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని ముంబై నుంచి కొచ్చి ఎయిర్‌పోర్టు అధికారులకు చేరవేశారు.

ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇన్‌ లైన్ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా లగేజీని చెక్ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

ఎయిరిండియాకు చెందిన ఏఐ 149 నెంబరు గల విమానం కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో విమానంలో బాంబు పెట్టినట్టు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తనిఖీలు తర్వాత ఏమీ లేవని తేలడంతో లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కొచ్చిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ALSO READ: తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్, విపక్షాలకు చిక్కిన ప్రధాని మోదీ

Advertisement

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మలప్పురం జిల్లాకు చెందిన సుహైబ్‌గా తేల్చారు. కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో చెకిన్ సమయంలో సుహైబ్, అతడి భార్య, కూతుర్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో స్కూల్స్, ఎయిర్‌పోర్టులకు విపరీతంగా బాంబు బెదిరింపుల వస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెల్సిందే.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×