BigTV English
Advertisement

Bomb Threat to Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అనుమానితుడు అరెస్ట్..!

Bomb Threat to Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అనుమానితుడు అరెస్ట్..!

Bomb threat to Air India Flight: కొచ్చిన్ నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని ముంబై నుంచి కొచ్చి ఎయిర్‌పోర్టు అధికారులకు చేరవేశారు.


ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇన్‌ లైన్ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా లగేజీని చెక్ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిరిండియాకు చెందిన ఏఐ 149 నెంబరు గల విమానం కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో విమానంలో బాంబు పెట్టినట్టు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తనిఖీలు తర్వాత ఏమీ లేవని తేలడంతో లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కొచ్చిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.


ALSO READ: తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్, విపక్షాలకు చిక్కిన ప్రధాని మోదీ

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మలప్పురం జిల్లాకు చెందిన సుహైబ్‌గా తేల్చారు. కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో చెకిన్ సమయంలో సుహైబ్, అతడి భార్య, కూతుర్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో స్కూల్స్, ఎయిర్‌పోర్టులకు విపరీతంగా బాంబు బెదిరింపుల వస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెల్సిందే.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×