BigTV English

lungi Politics in Odisha: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

lungi Politics in Odisha: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

lungi Politics in Odisha: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారం చేయడంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఒడిశాలో మాత్రం ఈసారి లుంగీ ప్రచారం జోరందుకుంది. ఈ లుంగీ ప్రచారంపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం లుంగీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


అయితే, రాష్ట్రాలలో రీజనల్ పార్టీలు ఓటర్లను ఆకర్శించేందుకు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, బీజేడీ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఈసారి ఓ వీడియోలో ప్రత్యేకంగా కనిపించారు. లుంగీ కట్టుకుని, చేతిలో శంఖు గుర్తులున్న రెండు ప్లకార్డులను పట్టుకుని ఆ వీడియోలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు. అయితే, నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకుని వీడియోలో మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఆ తరువాత ధర్మేంద్ర ప్రధాన్ కు కౌంటర్ గా బీజేడీ నాయకులు లుంగీలు కట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇలా బీజేడీ నేతలు, బీజేపీ నేతల మధ్య ప్రస్తుతం లుంగీవార్ కొనసాగుతుంది.

Also Read: విరిగిపడిన భారీ కొండచరియలు..


ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒడిశాలో లుంగీ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై రాజకీయ నిపుణులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×