BigTV English
Advertisement

lungi Politics in Odisha: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

lungi Politics in Odisha: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

lungi Politics in Odisha: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారం చేయడంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఒడిశాలో మాత్రం ఈసారి లుంగీ ప్రచారం జోరందుకుంది. ఈ లుంగీ ప్రచారంపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం లుంగీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


అయితే, రాష్ట్రాలలో రీజనల్ పార్టీలు ఓటర్లను ఆకర్శించేందుకు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, బీజేడీ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఈసారి ఓ వీడియోలో ప్రత్యేకంగా కనిపించారు. లుంగీ కట్టుకుని, చేతిలో శంఖు గుర్తులున్న రెండు ప్లకార్డులను పట్టుకుని ఆ వీడియోలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు. అయితే, నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకుని వీడియోలో మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఆ తరువాత ధర్మేంద్ర ప్రధాన్ కు కౌంటర్ గా బీజేడీ నాయకులు లుంగీలు కట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇలా బీజేడీ నేతలు, బీజేపీ నేతల మధ్య ప్రస్తుతం లుంగీవార్ కొనసాగుతుంది.

Also Read: విరిగిపడిన భారీ కొండచరియలు..


ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒడిశాలో లుంగీ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై రాజకీయ నిపుణులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×