Big Stories

Massive Landslide: రహదారి మధ్యలో భారీ గుంత.. ఎలా ఏర్పడిందంటే?

Massive Landslide: గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమైతుంది. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అరుణాచల్ ప్రదేశ్ లో వరద నీరు భారీగా పొంగిపొర్లుతుంది. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి కొట్టుకుపోయింది.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా చైనా సరిహద్దు జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దిబాంగ్ వ్యాలీతో రహదారి కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం జాతీయ రహదారి-33పై హున్లీ మరియు అనిని మధ్య భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది.

- Advertisement -

Also Read: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

విషయం తెలుసుకున్న ఎన్ హెచ్ఐడీసీఎల్ సిబ్బంది హైవే మరమ్మతు పనుల చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేదని అధికారులు చెప్పారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. రహదారి పనుల పునరుద్ధరణ కోసం మూడు రోజుల సమయం పడుతుందని తెలిపింది. అయితే, జాతీయ రహదారి-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఇటు ఆర్మీకి చాలా కీలకంగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News