E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఘోరం నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇంకా

Delhi News:  ఢిల్లీలో ఘోరం నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇంకా
Advertisement

Delhi News: ఢిల్లీలోని నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, నలుగురు మృతి

Advertisement

దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్‌లోని ఓ పాదరక్షల షాపులో శనివారం భారీ అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బాధితుల్లో ఇద్దరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

మిగతా ఇద్దరు వ్యక్తులు 38 ఏళ్ల అనిత, మరొకరు 38 ఏళ్ల సతేందర్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పాదరక్షల దుకాణం నుండి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా భవనాన్ని చుట్టిముట్టాయి. ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Advertisement

మంటల్లో కాలిబూడిదైన చెప్పుల దుకాణం

ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి దర్యాప్తులో నిమగ్నమయ్యారు అధికారులు.

ఘటన జరిగిన దుకాణం పక్కన గదిలోని ఒక కుటుంబం నివసించింది. ఆ గదిలో రెండు కాలిపోయిన మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు. భవనానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో అగ్నిమాపక చర్యకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భవనంలో ఒకే ఒక ఎంట్రీ, అదే ఎగ్జిట్ కూడా ఉంది.

ALSO READ: కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే, కలిసిపోయిన నేతలు

దానికితోడు ఇరుకైన మెట్లు, వెంటిలేషన్ లేకపోవడంతో అందులోని వ్యక్తులు తప్పించుకునే మార్గం లేకపోయింది. ఫలితంగా భవనం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. లోపల ఉన్నవారికి బయటకు రావడానికి మార్గం లేకుండా పోయిందని చెప్పారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

 

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×