BigTV English

Dhoti Clad Farmer: ధోతి ధరించాడని రైతును అడ్డుకున్న మాల్‌కు పనిష్‌మెంట్

Dhoti Clad Farmer: ధోతి ధరించాడని రైతును అడ్డుకున్న మాల్‌కు పనిష్‌మెంట్

Bengaluru: ధోతీ ధరించాడని లోనికి అనుమతించని జీటీ మాల్ విమర్శలపాలైంది. సినిమా టికెట్లు కొనుక్కున్న తర్వాత లోనికి వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు తమ అసంతృప్తి వ్యక్తపరిచారు. ధోతీ ధరిస్తే మాల్‌లోకి రానివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ధోతీ ధరించడం మన సంస్కృతి అని, ధోతీ ధరించడానికి లోనికి అనుమతించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పౌర సమాజం నుంచి వచ్చిన తీవ్ర నిరసనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సదరు మాల్‌కు పనిష్‌మెంట్ ఇచ్చింది.


ఆ జీటీ మాల్‌ను వారం రోజులు మూసేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బైరాతి సురేశ్ మాట్లాడుతూ ‘బృహత్ బెంగళూరు మహానగర పాలకేకు చెందిన మాజీ కమిషనర్లను సంప్రదించాం. మాల్‌ను వారం రోజులపాటు మూసి వేసే నిబంధన ఉన్నదని చెప్పారు. ఆ నిబంధన కింద మాల్‌ను వారం రోజులపాటు మూసేస్తున్నాం’ అని చెప్పారు.

ఆ మాల్ పై బుధవారం కేసు కూడా ఫైల్ అయింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 126(2) కింద మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డులపై కేసు నమోదైంది.


అసలేం జరిగింది?

హవేరి జిల్లా నుంచి బెంగళూరుకు తన కొడుకును చూడటానికి ఫకీరప్ప అనే రైతు వచ్చాడు. కొడుకు తన తండ్రి వచ్చాడని బెంగళూరు చూపించాలనే ఉద్దేశ్యంతో బయటికి తీసుకెళ్లాడు. మాగాడి మెయిన్ రోడ్డులోని జీటీ మాల్‌లో సినిమాకు టికెట్లు బుక్ చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంది. తన తండ్రి ధోతీ ధరించాడని, మాల్ నిబంధనల ప్రకారం ధోతి ధరించిన వారికి అనుమతి లేదని సెక్యూరిటీ గార్డులు తెగేసి చెప్పారు. అప్పటికే టికెట్లు కొనుక్కున్నామని, లోనికి అనుమతించాలని సెక్యూరిటీ గార్డులకు విజ్ఞప్తి చేయగా ససేమిరా అన్నారు. అవసరమైతే తన తండ్రిని ధోతీకి బదులు ప్యాంట్ వేసుకోవాలని సూచించారు. ప్యాంటు ధరిస్తే లోనికి అనుమతిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాగా, ఈ పరిణామంపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని దుయ్యబట్టారు. దీంతో సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×