E-Paper
Advertisement

Bus Accident In UP: బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం

Bus Accident In UP:  బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం

Bus Accident In UP

Bus Accident In UP: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గాజీపూర్ జిల్లాల్లో బస్సుపై హైటెన్షన్ కరెంట్ వైరు తెగి పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు 35 మంది పెళ్లి బృందంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంత సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని గాజీపూర్ జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

బస్సులో మంటల చెలరేగగానే స్థానికులు స్పందించారు. వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బస్సు దగ్ధమైంది.

Read More: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదం.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్..

ప్రమాద సమయంలో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదంతో పెళ్లింట విషాదం నెలకొంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×