E-Paper
Advertisement

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ప్రభావం ఇతర రైలు సర్వీసులపై పడింది. ఈ ఘటన నేపథ్యంలో 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 38 రైళ్లను టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మళ్లించినట్లు ప్రకటించారు. హౌరా – పూరీ సూపర్‌ఫాస్ట్‌, హౌరా -బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌, హౌరా -చెన్నై మెయిల్‌, హౌరా -సికింద్రాబాద్‌, హౌరా -హైదరాబాద్‌, హౌరా -తిరుపతి, హౌరా -పూరీ సూపర్‌ఫాస్ట్‌ , హౌరా -సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ , సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు బెంగళూరు – గువాహటిరైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇక ఒడిశా ఘటనతో గోవా-ముంబై వందేభారత్‌ సర్వీస్ ప్రారంభం వాయిదా పడింది. ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×