E-Paper
Advertisement

Murder : ఢిల్లీలో దారుణం.. డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..

Murder : ఢిల్లీలో దారుణం..  డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..

Murder : 15 ఏళ్ల బాలుడు సొంత బామ్మను డబ్బుల కోసం హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో షహదారా ప్రాంతంలో జరిగింది. జల్సాలకు అలవాటు పడిన ఆ బాలుడు స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను హత్య చేశాడు. ఆమె దగ్గరున్న డబ్బులు దొంగలించి పారిపోయాడు. జీటీబీ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం నివాసం ఉంటుంది.

వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు అతని స్నేహితుడు ఇంటికి వచ్చారు. దుప్పటితో అదిమి ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను దొంగలించి పారిపోయారు. కొంత సేపటికి ఇంటికి చేరుకున్న వృద్ధుడు భార్య నిద్రలోనే చనిపోయిందని భావించాడు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతిరాలి నుదుటిపై గాయం ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానం వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. దీంతో బీరువా లాకర్‌లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనవడే బామ్మను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×