E-Paper
Advertisement

Kavitha: విచారణకు హాజరైన కవిత.. ఒకేసారి 9 మందిని ప్రశ్నించనున్న ఈడీ..

Kavitha: విచారణకు హాజరైన కవిత.. ఒకేసారి 9 మందిని ప్రశ్నించనున్న ఈడీ..

Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులిచ్చింది. అయితే గురువారమే కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. దీక్ష ఉండడంతో 11న వస్తారని కోరారు. అందుకు ఈడీ అంగీకరించడంతో శనివారం భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహన్‌రావుతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.

కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఆమెకు నైతిక మద్ధతు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీగా సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లతో సహా పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇక విచారణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.

ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఇవాళ్టి విచారణలో కవితతో పాటు 9 మందిని ఒకసారి ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరవింద్‌లను ఒకేసారి విచారించనున్నట్లు సమాచారం.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×