E-Paper
Advertisement

India Wonders: 70 వేల బల్బులు ఒకేసారి వెలిగే ప్యాలెస్.. మన దేశంలో అద్భుతాన్ని చూశారా?

India Wonders: 70 వేల బల్బులు ఒకేసారి వెలిగే ప్యాలెస్.. మన దేశంలో అద్భుతాన్ని చూశారా?
Advertisement

India Wonders: ఒకేసారి 10 బల్బులు వెలిగితేనే, ఆ వెలుతురు చూడడం కష్టం. అదే 70 వేల బల్బుల వెలుగులో మెరిసే భవనం ఉందని మీకు తెలుసా.. కేవలం ఆ లైటింగ్ చూసేందుకు రోజూ సందర్శకులు అక్కడికి క్యూ కడతారు. ఇంతకు 70 వేల బల్బులు వెలిగే ఆ ప్యాలెస్ ఏంటి? ఎందుకిలా అనే విషయాలు తెలుసుకుందాం.

మన దేశంలో అద్భుతాలకు కొదువలేదు. అందుకే విదేశీ పర్యాటకులు కూడా మన దేశ పర్యటనకు వచ్చి, ఇక్కడి అద్భుతాలకు ఫిదా కావాల్సిందే. అందుకే మన దేశం టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తోంది. అయితే ఈ ప్యాలెస్ చూసేందుకు మాత్రం ఎందరో విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు కేవలం ఇక్కడి లైటింగ్ చూసేందుకు వేల కిలోమీటర్ల నుండి సందర్శకులు వస్తారు. ఇంతకు ఆ ప్యాలెస్ ఏమిటంటే..

Advertisement

భారతదేశం అనేది సాంస్కృతిక సంపదతో, చరిత్రతో ప్రపంచంలో గొప్ప గుర్తింపు పొందిన దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి మైసూర్ ప్యాలెస్. ఇది కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, ఇది మన దేశానికి గుర్తింపు తీసుకువచ్చే ఒక కళాత్మక చిహ్నం కూడా.

అద్భుతమైన లైటింగ్ ఫెస్టివల్
మైసూర్ ప్యాలెస్ తన అందాన్ని మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా ప్రతిరోజూ సుమారు 70,000 బల్బులను ఒకేసారి వెలిగిస్తుంది. ఈ బల్బులు ప్యాలెస్ మొత్తాన్ని ప్రకాశవంతంగా మార్చి, రాత్రి ఆకాశాన్ని మెరుపులతో నింపేస్తాయి. ఇది చూసేందుకు ప్రతీ సాయంత్రం వేలాది మంది పర్యాటకులు వేల కిలోమీటర్లు దాటి వస్తారు.

Advertisement

లైటింగ్ లో నాటి సాంకేతికత
ఈ భారీ లైటింగ్‌కు LED బల్బులు, ఎనర్జీ సేవింగ్ లైట్స్ ప్రధానంగా ఉపయోగిస్తారు. బల్బుల అమరిక, నిర్వహణ కోసం ప్రత్యేక టెక్నీషియన్లు నియమించబడి ఉంటారు. అన్ని బల్బులు సమన్వయంతో వెలిగిస్తూ ప్యాలెస్ యొక్క కళాత్మక రూపాన్ని మరింత స్పష్టతగా చూపిస్తాయి.

విద్యుత్ వినియోగం..
70,000 బల్బులు ఒకేసారి వెలిగించడం భారీ విద్యుత్ వినియోగంతో పాటు, సాంకేతిక సవాళ్ళను కలిగిస్తుంది. కానీ, పర్యావరణాన్ని కాపాడటానికి, ఎక్కువగా LED లైటింగ్ వాడతారు. ఇవి తక్కువ విద్యుత్ కే వెలిగే లైట్లు కావడంతో, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకంగా నిలుస్తున్నాయి.

Also Read: Real Love Story: గులకరాయితో ప్రేమ.. ఆపై రొమాన్స్.. ఇదేం లవ్ బాబోయ్.. ఇదో వెరైటీ!

పర్యాటక ఆకర్షణ
మైసూర్ ప్యాలెస్ లో ప్రతి సాయంత్రం నిర్వహించే ఈ లైటింగ్ షో సందర్శకులకు గొప్ప ఆకర్షణ. దీన్ని చూడటానికి దేశీ, విదేశీ పర్యాటకులు కూడు భారీ సంఖ్యలో వస్తారు. దీని వల్ల మైసూర్ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. మైసూర్ ప్యాలెస్ లో దీపోత్సవ సందర్భంగా కూడా ఈ లైటింగ్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీని ద్వారా మన భారతీయ సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి ప్రదర్శించగలుగుతాం. మైసూర్ ప్యాలెస్ చారిత్రక నిర్మాణం అయినప్పటికీ, 70 వేల బల్బులు వెలిగించటం ద్వారా ప్యాలెస్ చారిత్రక, ఆధునికత కలిసిన నైపుణ్యంకు అందరూ తెగ ముచ్చట పడతారు.

మైసూర్ ప్యాలెస్ లో ప్రతి రోజు సుమారు 70,000 బల్బులు వెలుగుతూ, ఈ భవనం ఒక అద్భుత కళాత్మక అంచనాగా నిలిచింది. ఇది మన దేశం యొక్క సాంస్కృతిక, సాంకేతిక వైభవానికి సాక్ష్యం. మీరు ఇప్పుడే ఈ అద్భుతాన్ని చూడకపోతే, ఓసారి మైసూర్ పర్యటన ప్లాన్ చేయండి. రాత్రి సమయంలో ఈ ప్రకాశవంతమైన ప్యాలెస్ ను చూడటం మీ జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం అవుతుంది. మరెందుకు ఆలస్యం.. ఛలో మైసూర్.. అనేసేయండి!

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×