E-Paper
Advertisement

National Voters Day : ఓటరూ.. మేలుకో

National Voters Day : ఓటరూ.. మేలుకో
Advertisement
National Voters  Day

National Voters Day : ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం లాంటిది. రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి.. సరికొత్త జాబితాను సిద్ధం చేస్తోంది. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా దేశంలోని ఓటర్లంతా పాత జాబితాలోని తమ పేరును సరిచూసుకోవాలని, అందులో తప్పులుంటే సరిచేయించుకోవాలని ప్రకటించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలతో బాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రావటంతో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జాబితాలను ఈసీ సిద్ధం చేసింది.

జాతీయ ఓటరు సర్వీసుల వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. మన పేరు, వివరాలు ఇస్తే.. మన ఓటు ఉందో లేదో తెలిసి పోతుంది. అందులో మీ పేరు వివరాలు సరిగా లేకపోతే.. వాటిని సరిచేయించుకోవచ్చు. అలాగే మీ పోలింగ్ కేంద్రం, దాని వివరాలు వగైరాలన్నీ లభిస్తాయి.

Advertisement

ఇక.. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌‌లో నమోదు చేసుకోవాలనుకునే వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఫారం-6 నింపితే సరిపోతుంది. నేరుగా వెళ్లి దరఖాస్తు చేయాలనుకుంటే.. మీ గ్రామ సచివాలయంలో బూత్‌లెవల్‌ ఆఫీసరుకు ఫారం-6 ఇవ్వాలి. ఒకవేళ మీ ఓటును మీకు తెలియకుండానే జాబితా నుంచి తొలగిస్తే.. ఆ సంగతిని ప్రస్తావిస్తూ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై రాత పూర్వకంగానూ సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. దీనివల్ల మీ ఓటు తొలగించాలని ఎవరైనా ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేశారా అనేది తెలుస్తుంది.

ఓటరు జాబితాలో పేరున్నా, అందులో మీ పేరు, చిరునామా వంటి వాటిలో తప్పులు వస్తే.. ఫారం-8 ద్వారా సరిదిద్దుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లేదా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లో ఫారం-8 ద్వారా అప్లై చేసుకోవచ్చు. పట్టణాలకు వలస వచ్చిన వారు ఫారం-8 ద్వారా తమ ఓటును బదిలీ చేసుకోవచ్చు.

Advertisement

మొబైల్ సాయంతో మీ ఓటు నమోదు, వివరాలు సరిచేసుకోవటం వంటివి చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందిన యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలిస్తే చాలు..

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల సరుకులు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×