E-Paper
Advertisement

National Voters Day : ఓటరూ.. మేలుకో

National Voters Day : ఓటరూ.. మేలుకో
National Voters  Day

National Voters Day : ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం లాంటిది. రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి.. సరికొత్త జాబితాను సిద్ధం చేస్తోంది. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా దేశంలోని ఓటర్లంతా పాత జాబితాలోని తమ పేరును సరిచూసుకోవాలని, అందులో తప్పులుంటే సరిచేయించుకోవాలని ప్రకటించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలతో బాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రావటంతో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జాబితాలను ఈసీ సిద్ధం చేసింది.

జాతీయ ఓటరు సర్వీసుల వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. మన పేరు, వివరాలు ఇస్తే.. మన ఓటు ఉందో లేదో తెలిసి పోతుంది. అందులో మీ పేరు వివరాలు సరిగా లేకపోతే.. వాటిని సరిచేయించుకోవచ్చు. అలాగే మీ పోలింగ్ కేంద్రం, దాని వివరాలు వగైరాలన్నీ లభిస్తాయి.

ఇక.. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌‌లో నమోదు చేసుకోవాలనుకునే వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఫారం-6 నింపితే సరిపోతుంది. నేరుగా వెళ్లి దరఖాస్తు చేయాలనుకుంటే.. మీ గ్రామ సచివాలయంలో బూత్‌లెవల్‌ ఆఫీసరుకు ఫారం-6 ఇవ్వాలి. ఒకవేళ మీ ఓటును మీకు తెలియకుండానే జాబితా నుంచి తొలగిస్తే.. ఆ సంగతిని ప్రస్తావిస్తూ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై రాత పూర్వకంగానూ సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. దీనివల్ల మీ ఓటు తొలగించాలని ఎవరైనా ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేశారా అనేది తెలుస్తుంది.

ఓటరు జాబితాలో పేరున్నా, అందులో మీ పేరు, చిరునామా వంటి వాటిలో తప్పులు వస్తే.. ఫారం-8 ద్వారా సరిదిద్దుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లేదా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లో ఫారం-8 ద్వారా అప్లై చేసుకోవచ్చు. పట్టణాలకు వలస వచ్చిన వారు ఫారం-8 ద్వారా తమ ఓటును బదిలీ చేసుకోవచ్చు.

మొబైల్ సాయంతో మీ ఓటు నమోదు, వివరాలు సరిచేసుకోవటం వంటివి చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందిన యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలిస్తే చాలు..

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×