E-Paper
Advertisement

ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం బిగ్ షాక్!.. ఇకపై అలా చేస్తే మీ ఉద్యోగం ఊస్టే..?

ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం బిగ్ షాక్!.. ఇకపై అలా చేస్తే మీ ఉద్యోగం ఊస్టే..?
Advertisement

Traffic Rules: స్వేచ్చ బ్యూరో: ట్రాఫిక్​ నియంత్రణను మెరుగు పరచటంతోపాటు యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్​ పోలీసుల కోసం కొత్త రూల్స్​‌ను ప్రతిపాదించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు ప్రస్తుతం పరిశీలన జరుపుతున్నారు.

ఏ రోడ్డు చూసినా..

హైదరాబాద్ మహానగరంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. పీక్​ టైం అయిన ఉదయం సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాహనదారులు చాలామంది ట్రాఫిక్​ నిబంధనలను పాటించక పోవటం ముందుకు వెళ్లటమే లక్ష్యంగా కనీసం ట్రాఫిక్​ లేన్​‌లను కూడా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్​ జాంలు సర్వసాధారణమయ్యాయి. గంటల తరబడి ట్రాఫిక్​ జాంలలో చిక్కుకుని వాహనదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక, ర్యాష్​ డ్రైవింగ్, రాంగ్ రూట్​‌లో వాహనాలు నడపటం వంటి కారణాలతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Advertisement

Also read: Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

ఆటోమేటిక్​ సిగ్నళ్లు..

వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించటం జాంలు కాకుండా చూడటం కోసం ట్రాఫిక్​ పోలీసులు పని చేస్తున్నారు. అయితే, వీరిలో పలువురు అసలు డ్యూటీ వదిలేసి మొబైల్ ఫోన్లు చూడటంలోనే బిజీగా ఉంటున్నారు. సిగ్నళ్లు ఉన్న ఏ చౌరస్తాలో చూసినా ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. ఆటోమేటిక్​ సిగ్నళ్లు ఉండటంతో ఇక తమకేం పని అన్నట్టుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. సిగ్నళ్లను చూసి వెళతారులే అని అనుకుంటూ మొబైల్​ ఫోన్లలో రీల్స్ చూస్తున్నారు. వాట్సాప్​ చాటింగులు చేస్తున్నారు. తెలిసిన వారితో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది ఈ అలసత్వాన్ని అవకాశంగా చేసుకుంటూ వాహనదారులు గ్రీన్​ సిగ్నల్ పడక ముందు రయ్యిన దూసుకుపోతున్నారు. దాంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ట్రాఫిక్​ స్తంభించిపోతోంది.

త్వరలో నూతన నిబంధనలు..

Advertisement

ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్​ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించటానికి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్​ సిబ్బంది సెల్​ ఫోన్​ వినియోగించే అంశంపై సీరియస్​ గా దృష్టి సారించారు. డ్యూటీలో ఉన్న సమయంలో ట్రాఫిక్​ పోలీసులు సెల్​ ఫోన్​ తీసుకు రాకుండా నిబంధనను అమల్లోకి తీసుకు రావాలని యోచిస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వీఎచ్ఎఫ్ సిగ్నలింగ్ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ పోలీసుకు వీఎచ్ఎఫ్ సెట్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. కొత్త విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also read: NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

Related News

Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

Hyderabad Flyover: పెట్రోల్, టైమ్ రెండూ ఆదా.. జీహెచ్‌ఎంసీ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

ఫేక్ ఫోన్ పే స్కామ్.. 97 వేల బంగారంతో నిందితుడు జంప్.. ఇదిగో వీడియో!

ఎదురు నిలబడలేక.. తనను ఓడించేందుకు బీజేపీ-బీఆర్ఎస్ భారీ కుట్రలు-సీఎం రేవంత్‌రెడ్డి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఘోరం.. ఇండిగో మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులు.. బినామీల వేటలో ఏసీబీ.. ట్రాన్స్‌కో DE కి ముచ్చెమటలు!

Big Stories

Advertisement
×