E-Paper
Advertisement

New districts in Ladakh: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

New districts in Ladakh: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

Centre to create 5 new districts in Ladakh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ విజన్ ప్రకారం..లడఖ్ అభివృద్ధి, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం రెండు జిల్లాలు లేహ్, కార్గిల్ ఉండగా..అదనంగా మరో ఐదు జిల్లాలు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్త జిల్లాల పేర్లను జన్‌స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చంగ్‌థంగ్‌గా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని తెలిపారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎలక్షన్స్..బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్

జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కొత్త జిల్లాల ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×