E-Paper
Advertisement

Nitish Kumar: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్‌కే పగ్గాలు?

Nitish Kumar: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్‌కే పగ్గాలు?
Advertisement

Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కూడా నితీష్ కుమార్ కు బీహార్ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రెండు సార్లు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఈసారి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేయలేదు. 30 ఏళ్ల క్రితం ఆయన ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్నారు. మొత్తంగా బీహార్ ఎన్నికల్లో మూడుసార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగా, రెండుసార్లు గెలిచారు.

రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే

రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఎంపీగా పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నితీష్ ఆరుసార్లు గెలిచారు. 1985లో తొలిసారి నితీష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పదేళ్ల తర్వాత 1995లో బీహార్‌లోని హర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ తర్వాత రాజీనామా చేసి ఎంపీగా విజయం సాధించారు. బీహార్ అసెంబ్లీకి ఆయన మొట్టమొదటిసారిగా 1977లో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1995 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పటికీ, నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

నితీష్ కుమార్ సీఎం కానీ ఎమ్మెల్యే కాదు

Advertisement

నితీష్ కుమార్ 2000లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 8 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం 2005లో మరోసారి సీఎం అయ్యారు. అప్పటి నుండి 2014 వరకు ఆయన సీఎంగా కొనసాగారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమితో సీఎంగా రాజీనామా చేశారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో ఆయన రెండు సభల్లోనూ సభ్యుడిగా లేరు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచి సీఎం బాధ్యతలు స్వీకరించేవారు.

Also Read: Nitish Kumar: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్

ఎమ్మెల్సీగా ఉంటూ

Advertisement

చట్టం ప్రకారం సీఎం లేదా మంత్రి పదవికి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉండాలి. కానీ బీహార్ లో ఎగువ సభగా శాసనమండలి ఉంది. 2012 లో తన పదవీకాలం ముగిసే వరకు నితీష్ కుమార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పోటీ తట్టుకోలేక ఎగువ సభకు తిరిగి ఎన్నికయ్యారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. కానీ నితీష్ మాత్రం తనకు ఎగువ సభ అంటే గౌరవం అంటుంటారు. నితీష్ 2018 మూడోసారి, 2024లో నాల్గోసారి శాసన మండలికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×