E-Paper
Advertisement

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

MP News:  దేశవ్యాప్తంగా టూ వీలర్స్ వాహనదారులు హెల్మెంట్లు లేకుండా ప్రమాదాలు బారినపడి యువత అధికంగా మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం ట్రాన్స్‌పోర్టు మంత్రి గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా టూ వీలర్స్ వాహనదారులు పట్టించుకోలేదు. చివరకు హెల్మెంట్ లేని వారికి పెట్రోల్ ఇవ్వడం లేదు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.

దేశంలోని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో  టూ వీలర్స్ వాహనదారులకు కచ్చితంగా హెల్మెంట్ ఉండాల్సిందే. లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఫైన్ వేయడం చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం చేస్తున్నారు. దీనివల్ల సిటీలో యాక్సిడెంట్ తగ్గినట్టు ఓ అంచనా.

ఇదే పద్దని మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఆగస్టు ఒకటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్ నగరాల్లో నో హెల్మెంట్.. నో పెట్రోల్ ఆదేశాలను బంకులు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇది మిగతా జిల్లాలకు క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా భిండ్ జిల్లాకు పాకింది. అక్కడ నో హెల్మెంట్.. నో పెట్రోల్ కాన్సెప్ట్‌‌ని పెట్రోల్ పంపులు అమలు చేస్తున్నాయి.

ఈ రూల్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద వారిపై కఠినచర్యలు తప్పవని చెబుతున్నారు. వారానికి రెండు జిల్లాల చొప్పున ఈ రూల్స్ విధించడంతో ఈనెల చివరికి రాష్ట్రమంతా అమలు చేసే అవకాశముందని అంటున్నారు.

ALSO READ: కూలిన హెలికాఫ్టర్.. మంత్రులు మృతి

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు తెర వెనుక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది వాహనదారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ కొనుగోలు చేయడానికి కొందరు ఈ రూల్స్‌ని పక్కదారి పట్టిస్తున్నారు.

హెల్మెట్‌లను కొద్ది గంటలపాటు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కూడా ఇండోర్‌లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై మీడియాకు చిక్కడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి కొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా హెల్మెంట్ పద్దతి రావచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×